Monday 11 May 2020

Indian Railways plans to restart passenger train from 12th May, 2020

Indian Railways plans to restart passenger train from 12th May, 2020
Indian Railways plans to gradually restart passenger train operations from 12th May, 2020, initially with 15 pairs of trains



Indian Railways plans to restart passenger train from 12th May, 2020


These trains will be run as special trains from New Delhi Station connecting 15 important cities of the country

మే 17 వరకూ ప్రయాణికుల రైళ్లు నడవవని ఇదివరకు చెప్పిన రైల్వే శాఖ నిర్ణయం మార్చుకుంది. ఈ నెల 12 నుంచి ప్రయాణికుల రైళ్లను నడపబోతున్నట్లు ప్రకటించింది. న్యూఢిల్లీ నుంచి దేశంలోని 15 గమ్యస్థానాలకు ఈ రైళ్లను (మొత్తం 30 సర్వీసులు) నడపనుంది. వీటిని స్పెషల్ ట్రైన్లుగా పిలుస్తోంది. 




న్యూఢిల్లీ నుంచి సికింద్రాబాద్, దిబ్రూగర్, అగర్తలా, హౌరా, పాట్నా, బిలాస్‌పూర్, రాంచీ, భువనేశ్వర్, బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం, మడ్‌గావ్, ముంబై సెంట్రల్, అహ్మదాబాద్, జమ్మూతావీ రైల్వే స్టేషన్లకు ఈ రైళ్లు వెళ్తాయి. వీటికి ఈనెల 11 (నేడే) సాయంత్రం 4 గంటల నుంచి IRCTCలో టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

స్పెషల్ ట్రైన్లకు టికెట్ బుకింగ్ IRCTC ద్వారా మాత్రమే ఉంటుంది.- మే 11 సాయంత్రం 4 గంటల నుంచి టికెట్లు బుక్ చేసుకోవచ్చు

  1. రైల్వేస్టేషన్లలో టికెట్ బుకింగ్ కేంద్రాల్లో టికెట్లు అమ్మరు. ప్లాట్‌ఫాం టికెట్లు కూడా అమ్మరు.
  2. టికెట్ కన్‌ఫాం అయిన ప్రయాణికులు... గంట ముందే స్టేషన్‌కి రావాలి.- స్టేషన్‌కి వచ్చిన ప్రయాణికులకు థెర్మల్ స్క్రీనింగ్, కరోనా టెస్టులు జరుపుతారు.
  3. ప్రయాణికులు ఏం చెయ్యాలో, చెయ్యకూడదో టికెట్లపై రాసి ఉంటుంది. తప్పనిసరిగా ఫాలో అవ్వాలి.
  4. ప్రయాణికులు తమ మొబైళ్లలో తప్పనిసరిగా ఆరోగ్య సేతు (Arogya Setu App) యాప్ డౌన్‌లోడ్ చేసుకొని ఉండాలి.
  5. ఆరోగ్య సేతు యాప్ డౌన్‌లోడ్ చేశాక, లొకేషన్, బ్లూ టూత్ ఆప్షన్ కచ్చితంగా ఆన్ (on)లో ఉంచాలి.
  6. ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి.
  7. కన్‌ఫాం టికెట్ ఉన్న వారికి మాత్రమే రైల్వే స్టేషన్‌లోకి అనుమతి ఉంటుంది.




కరోనా వైరస్ లక్షణాలు లేని వారికి మాత్రమే అనుమతి ఉంటుంది.కరోనా వైరస్ లక్షణాలు లేని వారికి మాత్రమే ట్రైన్ ఎక్కనిస్తారు.

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.