National Means cum Merit Scholarship Examination (NMMS) 2020 Applications are invited from 8th class students in the State of Andhra Pradesh at officialwebsite at www.bseap.org / నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష (NMMS) 2020 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని 8 వ తరగతి చదువుచున్న విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుచున్నవి.
National Means cum Merit Scholarship Examination (NMMS) 2020 Applications are invited from 8th class students
తేదీ 14.02.2021 న జరగనున్న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష (NMMS) కొరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని 8 వ తరగతి చదువుచున్న విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుచున్నవి.
ఈ పరీక్ష వ్రాయుటకు రాష్ట్రం లోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మునిసిపల్, ఎయిడెడ్ 8వ తరగతి సడపబడుచున్న మండల పరిషత్ ప్రాధమికోన్నత పాఠశాలలు మరియు వసతి సౌకర్యం లేని ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలలలో 8 వ తరగతి చదువుచున్న విద్యార్థులు అర్హులు.
పరీక్ష రుసుము జనరల్ మరియు బి.సి విద్యార్థులకు రూ.100/- మరియు యస్.సి, యస్.టి విద్యార్థులకు రూ.50/-లు దరఖాస్తులను ఆప్ లైను లో 09-11-2020 నుండి స్వీకరించబడును. ఆప్ లైను లో దరఖాస్తు చేసుకొనుటకు చివరి తేదీ 09 -12-2020 మరియు పరీక్ష రుసుము చెల్లించుటకు చివరి తేదీ 10-12-2020.
పూర్తి వివరముల కొరకు ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయపు వెబ్ సైటు www.bseap.org నందు మరియు సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో తెలుసుకొనగలరు అని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు శ్రీ ఎ.సుబ్బారెడ్డి గారు తెలియజేసారు.
Get Complete Information about NMMS Click here
0 comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.