Tuesday 15 June 2021

ఇక డిగ్రీలో తెలుగు మాధ్యమం ఉండదు - 2021-22 నుంచి ఆంగ్లంలో కోర్సుల నిర్వహణ

ఇక డిగ్రీలో తెలుగు మాధ్యమం ఉండదు - 2021-22 నుంచి ఆంగ్లంలో కోర్సుల నిర్వహణ

ఇక డిగ్రీలో తెలుగు మాధ్యమం ఉండదు - 2021-22 నుంచి ఆంగ్లంలో కోర్సుల నిర్వహణ! | ఈ విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ కళాశాలలు ఆంగ్ల మాధ్యమంలోనే కోర్సులను నిర్వహించాలని ఉన్నత విద్యామండలి సోమవారం ప్రకటన విడుదల చేసింది


ఇక డిగ్రీలో తెలుగు మాధ్యమం ఉండదు - 2021-22 నుంచి ఆంగ్లంలో కోర్సుల నిర్వహణ


ఈ విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ కళాశాలలు ఆంగ్ల మాధ్యమంలోనే కోర్సులను నిర్వహించాలని ఉన్నత విద్యామండలి సోమవారం ప్రకటన విడుదల చేసింది ప్రస్తుతం తెలుగు మాధ్యమంలో కోర్సులు నిర్వహిస్తున్న ప్రైవేటు కళాశాలలు మాధ్యమం మార్పునకు ఈ నెల 18 నుంచి 28 వరకు ప్రతిపాదనలు సమర్పించాలని సూచించింది




65 వేల మంది విద్యార్థులపై ప్రభావం


రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో 2021-22 విద్యా సంవత్సరం నుంచి తెలుగు మాధ్యమం మూతపడనుంది. ఇక నుంచి విద్యార్థులు తెలుగులో చదివే అవకాశం కోల్పోనున్నారు. కళాశాలలన్నీ పూర్తిగా మారిపోనున్నాయి. ఉన్నత విద్యపై ఫిబ్రవరి 2న సీఎం జగన్ నిర్వహించిన సమీక్షలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ కళాశాలలు ఆంగ్ల మాధ్యమంలోనే కోర్సులను నిర్వహించాలని ఉన్నత విద్యామండలి సోమవారం ప్రకటన విడుదల చేసింది. 

నాలుగేళ్ల డిగ్రీ కోర్సులను ఆంగ్లంలో నిర్వహిస్తేనే ఆమోదించనున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం తెలుగు మాధ్యమంలో కోర్సులు నిర్వహిస్తున్న ప్రైవేటు కళాశాలలు మాధ్యమం మార్పునకు ఈ నెల 18 నుంచి 28 వరకు ప్రతిపాదనలు సమర్పించాలని సూచించింది. ప్రతిపాదనలు సమర్పించకపో కళాశాలలు నిర్వహించేందుకు వీలుండదని పేర్కొంది.

కోర్సులను రాష్ట్రంలో ఆంగ్ల మాధ్యమం అమల్లో రావడం, తెలుగులో చదివే 65,981 మంది విద్యార్థులపై ప్రభావం చూపనుంది. గతేడాది నిర్వహించిన ఆన్లైన్ ప్రవేశాల్లో 1,336 డిగ్రీ కళాశాలల్లో 2.60 లక్షల మంది చేరారు. వీరిలో 65 వేల మంది తెలుగు మాధ్యమాన్ని ఎంచుకున్నారు. వీరిలో బీఎస్సీ కోర్సును ఎంపిక చేసుకున్నవారు అధికం. 

గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఎక్కువగా తెలుగు మాధ్యమంపై ఆసక్తి చూపుతున్నారు. ఈ విద్యా సంవత్సరంలో ఆంగ్లం ఒక్కటే అమలు చేస్తే వీరు తెలుగులో చదివే అవకాశాన్ని కోల్పోనున్నారు.

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.