Wednesday 30 June 2021

ఏపీ కేబినెట్ మీటింగ్ 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు ల్యాప్టాప్ పంపిణీకి ఆమోదం

ఏపీ కేబినెట్ మీటింగ్ 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు ల్యాప్టాప్ పంపిణీకి ఆమోదం

ఏపీ కేబినెట్ మీటింగ్ 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు ల్యాప్టాప్ పంపిణీకి ఆమోదం | ఏపీ కేబినెట్ మీటింగ్ లో పలు కీలక నిర్ణయాలు తీసకున్నారు. ముఖ్యంగా 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు ల్యాప్టాప్ పంపిణీకి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ వెటర్నరీ అంబులెన్స్ల కొనుగోలుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.


ఏపీ కేబినెట్ మీటింగ్ 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు ల్యాప్టాప్ పంపిణీకి ఆమోదం


నవరత్నాల్లో భాగంగా 28 లక్షల ఇళ్ల నిర్మాణానికి భారీ ప్రచార కార్యక్రమానికి పచ్చజెండా ఊపింది. ఒంగోలు శివారులో ఆంధ్రకేసరి వర్సిటీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విజయనగరం జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలను వర్సిటీగా మార్పుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. జేఎన్టీయూ చట్టం 2008 సవరణకు మంత్రివర్గం అంగీకారం తెలిపింది. 




టిడ్కో ద్వారా 2,62,216 ఇళ్ల నిర్మాణం పూర్తికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మౌలిక సదుపాయాల కల్పనకు రూ.5990 కోట్ల మేర బ్యాంకు రుణం హామీకి మంత్రివర్గం అంగీకరించింది. 2021-24 ఐటీ విధానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 

భూముల రీ సర్వేలో పట్టాదారులకు ధ్రువపత్రాల జారీకి ఏపీ భూహక్కు చట్ట సవరణకు ఆమోదం తెలిపింది కేబినెట్. విశాఖ నక్కపల్లి వద్ద హెటిరో డ్రగ్స్ సెజ్ు భూ కేటాయింపునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 81 ఎకరాల భూకేటాయింపునకు అంగీకారం తెలిపింది.


కేబినెట్ నిర్ణయాలు చర్చించిన ముఖ్య అంశాలు


9 నుంచి 12 తరగతి విద్యార్థులకు ల్యాప్ టాప్

రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ వెటర్నరీ అంబులెన్స్‌ల కొనుగోలు,

28 లక్షల ఇళ్ల నిర్మాణానికి భారీ ప్రచార కార్యక్రమం.

ఒంగోలు శివారులో ఆంధ్రకేసరి వర్సిటీ ఏర్పాటు.

విజయనగరం జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాలను వర్సిటీగా మార్పు.

టిడ్కో ద్వారా 62, 216 ఇళ్ల నిర్మాణం.

మౌలిక సదుపాయాల కల్పనకు రూ.5990 కోట్ల మేర బ్యాంకు రుణం హామీకి ఆమోదం

2021-24 ఐటీ విధానానికి ఆమోదం.

కాకినాడ పోర్టులో రీ గాసిఫికేషన్ టెర్మినల్ ఏర్పాటుపై చర్చ.

మారిటైమ్ బోర్డుతో సంయుక్తంగా కార్యకలాపాల నిర్వహణకు అనుమతి.

రీసర్వేలో పట్టాదారులకు ధ్రువపత్రాల జారీకి ఏపీ భూహక్కు చట్ట సవరణ.

విశాఖ నక్కపల్లి వద్ద హెటిరో డ్రగ్స్‌ సెజ్‌కు81 ఎకరాల భూకేటాయింపునకు అంగీకారం.

రూ.864 కోట్లతో హంద్రీనీవా సుజల స్రవంతి పధకం. గ్రావిటీ ద్వారా నీటి సరఫరాకుా అంగీకారం.

రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు 539 కొత్త 104 వాహనాలను కొనుగోలు.

విజయవాడలో గుణదలలో కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటు.

సత్యనారాయణ పురం, మాచవరం పరిధిలోని కొన్ని ప్రాంతాలను కొత్త పోలీస్ స్టేషన్ పరిధిలో చేర్చేందుకు ఆమోదం

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.