Thursday 24 June 2021

పదో తరగతి, ఇంటర్‌పరీక్షల నిర్వహణపై ఒక్కరు చనిపోయినా రూ కోటి పరిహారమివ్వాలి - సుప్రీం కోర్టు

పదో తరగతి, ఇంటర్‌పరీక్షల నిర్వహణపై ఒక్కరు చనిపోయినా రూ కోటి పరిహారమివ్వాలి - సుప్రీం కోర్టు

పదో తరగతి, ఇంటర్‌పరీక్షల నిర్వహణపై ఒక్కరు చనిపోయినా రూ కోటి పరిహారమివ్వాలి - సుప్రీం కోర్టు | ఒక్కరు చనిపోయినా రూ.కోటి పరిహారమివ్వాలి సుప్రీం కోర్టు | పదో తరగతి, ఇంటర్‌పరీక్షల నిర్వహణపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌పై సుప్రీం కోర్టు అనేక ప్రశ్నలు సంధించింది | పరీక్షలు జరుగుతున్న సమయంలోనే మూడో వేవ్ వస్తే అప్పుడు ఏం చేస్తారని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది


పదో తరగతి, ఇంటర్‌పరీక్షల నిర్వహణపై ఒక్కరు చనిపోయినా రూ కోటి పరిహారమివ్వాలి - సుప్రీం కోర్టు


దిల్లీ: పదో తరగతి, ఇంటర్‌పరీక్షల నిర్వహణపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌పై సుప్రీం కోర్టు అనేక ప్రశ్నలు సంధించింది.  పరీక్షల నిర్వహణకు సంబంధించి పక్కా సమాచారం ఒక్కరు చనిపోయినా రూ.కోటి పరిహారమివ్వాలి సుప్రీం కోర్టు




పరీక్షల నిర్వహణే ఆలోచనగా ఉండొద్దని, సిబ్బంది, విద్యార్థుల రక్షణ కోణంలోనూ ప్రభుత్వం ఆలోచించాలని తెలిపింది. ఒక్కరు చనిపోయినా ఒక్కొక్కరికీ రూ.1 కోటి పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించింది. 

మన నిర్ణయాలు భవిష్యత్‌ తరాలకు మార్గదర్శకంగా ఉండాలని వ్యాఖ్యానించింది. పరీక్షలు నిర్వహించే గదుల వివరాలు అఫిడవిట్‌లో ఎక్కడా లేవని.. ప్రభుత్వం ఇచ్చే లెక్కల ప్రకారం చూస్తే సుమారు 28 వేల గదులు అవసరమవుతాయని వ్యాఖ్యానించింది. కరోనా వేళ ఒక్కో గదిలో 15 నుంచి 20 మంది కూర్చోవడం ఎలా సాధ్యమని ప్రశ్నించింది. 

రెండో దశలో ఎలాంటి పరిస్థితి వచ్చిందో కళ్లారాచూశాం కదా అని ఏపీ ప్రభుత్వ న్యాయవాదిని ఉద్దేశించి ప్రశ్నించింది.

‘‘ఒక్కో గదిలో 15 నుంచి 20 మంది విద్యార్థులు ఎలా పరీక్ష రాయగలుగుతారు. వేలకొద్దీ పరీక్ష గదులను ఎలా అందుబాటులోకి తీసుకొచ్చి, సమన్వయం చేయగలుగుతారు. పరీక్ష నిర్వహించాము పని అయిపోయింది అనుకోలేము కదా. పరీక్ష తర్వాత వాటిని మూల్యాంకనం చేయాలి, ఆ తర్వాత చాలా ప్రక్రియ ఉంటుంది ఇవేమీ మీ అఫిడవిట్ లో కనిపించలేదు. 

రెండో దశ  తీవ్రతను చూసి పలు వేరియంట్లు ఉన్నాయని నిపుణులు చెపుతున్నా ఎందుకు ఇలా వ్యవహారిస్తున్నారు’’ అని సుప్రీం వ్యాఖ్యానించింది.  ఒక నిర్ణయాత్మక ప్రణాళిక ఉండాలని అభిప్రాయపడింది. 

అవసరమైతే సీబీఎస్ఈ, యూజీసీ, ఐసీఎస్ఈ బోర్డుల సలహాలు తీసుకోవాలని సూచించింది. గ్రేడ్లను మార్కులుగా మార్చడం కష్టమే అయినప్పటికీ, పరిస్థితులకు అనుగుణంగా వెళ్లాల్సి ఉంటుందని చెప్పింది. 

కొంత సమయం ఇస్తే చర్చించి ప్రభుత్వం నిర్ణయం వెల్లడిస్తామని ఏపీ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇప్పటికిప్పుడే నిర్ణయం తీసుకోవాలని, ఈ వ్యవహారం విద్యార్థులపై ఎంత ప్రభావం చూపుతుందో అర్థం చేసుకోవాలని సుప్రీం వ్యాఖ్యానించింది. పరీక్షలు జరుగుతున్న సమయంలోనే మూడో వేవ్ వస్తే అప్పుడు ఏం చేస్తారని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది.

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.