Friday 4 June 2021

పెన్షనర్లకు భారీ ఊరట కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

పెన్షనర్లకు భారీ ఊరట కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

పెన్షనర్లకు భారీ ఊరట కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం | కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పీఎఫ్ఆర్‌డీఏ తాజాగా ఎన్‌పీఎస్ స్కీమ్ రూల్స్‌ను సరళీకరించింది


పెన్షనర్లకు భారీ ఊరట కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం


కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పీఎఫ్ఆర్‌డీఏ తాజాగా ఎన్‌పీఎస్ స్కీమ్ రూల్స్‌ను సరళీకరించింది NPS విత్‌డ్రాయెల్ స్కీమ్ నుంచి విత్‌డ్రా చేసుకోవడం లేదంటే పథకం నుంచి ఎగ్జిట్ అవ్వడానికి నేరుగా డాక్యుమెంట్లు అందించాల్సిన పని లేదు.




మోదీ సర్కార్ పెన్షనర్లకు భారీ ఊరట కలిగించింది. కీలక నిర్ణయం తీసుకుంది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ PFRDA తాజాగా నేషనల్ పెన్షన్ సిస్టమ్

NPS విత్‌డ్రాయెల్ రూల్స్‌ను సరళీకరించింది దీంతో చాలా మందికి ఊరట కలుగనుంది.

కోవిడ్ 19 ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో పీఎఫ్ఆర్‌డీఏ పాయింట్స్ ఆఫ్ ప్రెజెన్స్‌కు PoPs అనుమతి ఇచ్చింది. అంటే ఎన్‌పీఎస్ సబ్‌స్క్రైబర్లకు సంబంధించిన ఎగ్జిట్ లేదా విత్‌డ్రాయెల్ డాక్యుమెంట్ల సెల్ఫ్ అటెస్డెడ్ కాపీలను డిజిటల్ రూపంలో స్వీకరించనుంది - జూన్ 30 వరకు ఈ ఫెసిలిటీ అందుబాటులో ఉంటుంది.

పీఎఫ్ఆర్‌డీఏ ఈ విషయానికి సంబంధించి ఒక సర్క్యూలర్ కూడా జారీ చేసింది. దీని ప్రకారం.. ఎన్‌పీఎస్ విత్‌డ్రాయెల్స్‌కు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను సబ్‌స్క్రైబర్లు డిజిటల్ రూపంలో సీఆర్ఏకు పంపొచ్చు. 

కోవిడ్ 19 సమయంలో ఎన్‌పీఎస్ విత్‌డ్రాయెల్‌కు సంబంధించి స్వయంగా డాక్యుమెంట్లు అందించడానికి పెన్షనర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని పీఎఫ్ఆర్‌డీఏ తెలిపింది.

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.