Monday 12 July 2021

ఫ్రీ ప్రైమరీ అంగన్వాడీ కేంద్రాలకు పీపీ-1, పీపీ-2 కిట్లు సరఫరా ఒక్కొ కిట్లో 8 పుస్తకాలు

ఫ్రీ ప్రైమరీ అంగన్వాడీ కేంద్రాలకు పీపీ-1, పీపీ-2 కిట్లు సరఫరా ఒక్కొ కిట్లో 8 పుస్తకాలు చొప్పున ఉన్నాయి వాటిలో ఆంగ్లం, తెలుగు, గణితం, ఆంగ్లం వర్క్ పుస్

ఫ్రీ ప్రైమరీ అంగన్వాడీ కేంద్రాలకు పీపీ-1, పీపీ-2 కిట్లు సరఫరా ఒక్కొ కిట్లో 8 పుస్తకాలు చొప్పున ఉన్నాయి వాటిలో ఆంగ్లం, తెలుగు, గణితం, ఆంగ్లం వర్క్ పుస్తకం, డ్రాయింగ్, యాక్టివిటీ తదితర సబ్జెక్టుల పుస్తకాలు ఉన్నాయి అంగన్వాడీ కేంద్రాలకు ఆంగ్ల పుస్తకాలు 


ఫ్రీ ప్రైమరీ అంగన్వాడీ కేంద్రాలకు పీపీ-1, పీపీ-2 కిట్లు సరఫరా ఒక్కొ కిట్లో 8 పుస్తకాలు


కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా పేదింటి చిన్నారులకు ఆంగ్ల విద్యాబోధన అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అంగన్వాడీలను బలోపేతం చేస్తోంది. గత ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో బోధనను ప్రారంభించింది. ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాలను వైఎస్సార్ ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మార్చి మూడేళ్ల ప్రాయం నుంచే చిన్నారులకు ఏబీసీడీలు నేర్పించేలా ఏర్పాట్లు చేసింది. 




ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్య మాదిరిగా పీపీ-1, పీ-2 తరగతులను అందుబాటులోకి తెచ్చారు. 

నూతన విద్యా విధానం ప్రకారం రూపొందించిన పాఠ్యపుస్తకాలను ప్రతి కేంద్రానికి పంపిణీ చేశారు. విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించేందుకు అవసరమైన శిక్షణను కార్యకర్తలకు ఇచ్చారు ఒక్కో కిట్లో 8 పుస్తకాలు

ఈ విద్యా సంవత్సరం నుంచి అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్యా విధానాన్ని అమలు చేసేం దుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందు కోసం పీపీ-1, పీపీ-2 పాఠ్య పుస్తకాలు రూపొందించారు. ఆయా పుస్తకాల్లో ఆంగ్లం, తెలుగు, గణిత అక్షరాలు, చిన్నపాటి కథలను పాఠ్యాంశాలుగా పొం దుపరిచారు. జిల్లా కేంద్రానికి వచ్చిన పుస్తకాలను ఐసీడీఎస్ అధికారులు 3,621 అంగన్వాడీ కేంద్రాలకు పీపీ-1, పీపీ-2 కిట్లులకు సరఫరా చేశారు. 

కోవిడ్ తీవ్రత తగ్గి కేంద్రాలు తెరిచిన తర్వాత కార్యకర్తలు పూర్వ ప్రాథమిక విద్యను బోధించనున్నారు. మూడేళ్లు నిండిన చిన్నా రులకు పీపీ-1 పుస్తకాలు, నాలుగేళ్లు నిండిన వారికి పీపీ-2 పుస్తకాలు ఇవ్వనున్నారు. ఒక్కొ కిట్లో 8 పుస్తకాలు చొప్పున ఉన్నాయి. వాటిలో ఆంగ్లం, తెలుగు, గణితం, ఆంగ్లం వర్క్ పుస్తకం, డ్రాయింగ్, యాక్టివిటీ తదితర సబ్జెక్టుల పుస్తకాలు ఉన్నాయి ఇవి పిల్లలకు చాలా ఉపయోగకరమైనవి

అంగన్వాడీ కేంద్రాల్లో మూడేళ్ల చిన్నారులకు వారి మెదడు ఎదుగుదల ప్రారం భమవుతుంది. ఆ సమ యంలోనే వారిలో సృజనాత్మకత పెంపొందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం నూతన పూర్వ ప్రాథమిక విద్యా విధానానికి శ్రీకారం చుట్టింది. 

కోవిడ్ తీవ్రత తగ్గి కేంద్రాలకు పిల్లలు పూర్తి స్థాయిలో రాగానే పుస్త కాలు అందించేలా చర్యలు విద్యాబోధన చేపడతారు

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.