Saturday 17 July 2021

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు హౌస్ రెంట్ అలవెన్స్ (హెచ్ఆర్ఏ) పెంపు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు హౌస్ రెంట్ అలవెన్స్ (హెచ్ఆర్ఏ) పెంపు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు హౌస్ రెంట్ అలవెన్స్ (హెచ్ఆర్ఏ) పెంపు రివైజ్ చేసిన హెచ్ఆర్ఏను ఆగస్టు నుంచి ఉద్యోగులు అందుకోనున్నారు. డీఏ 25 శాతం దాటినందున హెచ్ఆర్ఏ పెంచినట్టు కేంద్రం పేర్కొంది


కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు హౌస్ రెంట్ అలవెన్స్ (హెచ్ఆర్ఏ) పెంపు


న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు జూలై 1 నుంచి కరువు భత్యాన్ని ప్రస్తుతం ఉన్న 17 శాతం నుంచి 28 శాతానికి ఇటీవల పెంచిన కేంద్రం మరో బొనంజా ప్రకటించింది. 

ఉద్యోగులకు మరో తీపికబురు: HRA పెంపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కారు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే డీఏను 17 నుంచి 28%కి పెంచిన సర్కారు తాజాగా హౌస్ రెంట్ అలవెన్స్ (HRA)ను పెంచింది. ఉద్యోగులు నివసించే ప్రాంతాన్ని బట్టి HRA అమలు కానుంది. 50 లక్షలకు పైగా జనాభా (X కేటగిరి)-27%, 5 లక్షల కంటే ఎక్కువ జనాభా (Y)- 18%, 5 లక్షల కంటే తక్కువ (Z)- 9% HRA ఉంటుంది. HRA పెంపు ఆగస్టు 1వ తేదీ నుంచి అమలు అవుతుందని ప్రభుత్వం తెలిపింది




తాజా సమాచారం ప్రకారం, ప్రభుత్వ ఉద్యోగాలకు హౌస్ రెంట్ అలవెన్స్ (హెచ్ఆర్ఏ)ను కూడా పెంచింది. రివైజ్ చేసిన హెచ్ఆర్ఏను ఆగస్టు నుంచి ఉద్యోగులు అందుకోనున్నారు. డీఏ 25 శాతం దాటినందున హెచ్ఆర్ఏ పెంచినట్టు కేంద్రం పేర్కొంది. 

ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వారు నివససిస్తున్న సిటీలను బట్టి వివిధ కేటగిరిలుగా హెచ్ఆర్ఏను అందుకుంటారు. ఎక్స్ కేటగిరీ సిటీల్లో ఉన్నవాళ్లకు 27 శాతం, వై, జడ్ కేటగిరీలకు 19, 9 శాతం పెంపు ఉంటుంది. డీఏ 50 శాతం దాటితే హెచ్ఆర్ఏ రేట్లు కేటగిరీలను బట్టి 30 శాతం, 20 శాతం, 10 శాతంగా రివైజ్ అవుతాయి. 

50 లక్షలకు పైగా ఉన్న జనాభా ఉన్న ఉంటే ఎక్స్ కేటగిరి సిటీ కింద పరిగణిస్తారు. 5 లక్షలకు పైగా  జనాభా ఉంటే వై కేటగిరి, 5 లక్షల కంటే తక్కువ జనాభా ఉంటే జడ్ కేటగిరిగా పరిగణిస్తారు.

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.