Monday 21 June 2021

ఉప్పు ఎక్కువైతే ముప్పే రోజుకు ఎంత తీసుకోవాలో తెలుసా?

ఉప్పు ఎక్కువైతే ముప్పే రోజుకు ఎంత తీసుకోవాలో తెలుసా?

ఉప్పు ఎక్కువైతే ముప్పే రోజుకు ఎంత తీసుకోవాలో తెలుసా?ఉప్పుగా అతిగా తీసుకుంటే ఆరోగ్యానికే ముప్పే. ఉప్పు మోతాదు మించిదే గుండె జబ్బులు, స్ట్రోక్స్ పెరుగుతాయని - ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) 


ఉప్పు ఎక్కువైతే ముప్పే రోజుకు ఎంత తీసుకోవాలో తెలుసా?


ఉప్పులేని వంటకం ఊహించగలమా? మన ప్రతి వంటలో ఉప్పు తప్పకుండా ఉండాల్సిందే. లేకపోతే ఆ ఆహారానికి రుచే ఉండదు. అయితే, కొంతమంది చాలా ఎక్కువ ఉప్పును తినేస్తుంటారు. ఆహారం సాల్టీగా ఉంటేనే ఇష్టపడతారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రమాణాల ప్రకారం.. ఉప్పుగా అతిగా తీసుకుంటే ఆరోగ్యానికే ముప్పే. ఉప్పు మోతాదు మించిదే గుండె జబ్బులు, స్ట్రోక్స్ పెరుగుతాయని WHO పేర్కొంది. 




ఉప్పు వినియోగాన్ని తగ్గించడం ద్వారా ఏటా సుమారు 25 లక్షల మంది ప్రాణాలను రక్షించవచ్చని తెలిపింది. శరీరానికి సోడియం అందాల్సిందే. కానీ, రోజూ తీసుకొనే ఉప్పులో మోతాదు కొంచెం పెరిగినా ప్రమాదమే. అయితే, చాలామందికి రోజుకు ఎంత ఉప్పు తినడం మంచిది? ఎంత తింటే ప్రమాదకరమనే విషయం తెలియదు. ఈ నేపథ్యంలో WHO తాజాగా రోజూ ఎంత ఉప్పు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదో వెల్లడించింది.

రోజుకు ఎన్ని గ్రాముల ఉప్పు తినాలి?: WHO సూచనల ప్రకారం ఒక మనిషి రోజుకు 5 గ్రాముల ఉప్పును మాత్రమే తీసుకోవాలి. అంతకంటే మించితే గుండె జబ్బులు, హార్ట్ ఎటాక్, కిడ్నీ సమస్యలు ఏర్పడతాయి. 

ఏటా ఉప్పును అతిగా వాడటం వల్ల కలుగుతున్న గుండె జబ్బులు, స్ట్రోక్స్ వల్ల ఏటా సుమారు 30 లక్షల మంది చనిపోతున్నారు. ఉప్పు మోతాదును తగ్గించడం ద్వారా ఏటా సుమారు 25 లక్షల మంది జీవితాలను కాపాడవచ్చని సంస్థ భావిస్తోంది. 2025 కల్లా ప్రపంచంలో సోడియం సాల్ట్ వాడకాన్ని 30 శాతానికైనా తగ్గించాలనే లక్ష్యం పెట్టుకుంది. ప్రాసెస్డ్ ఫుడ్‌ను అతిగా తీసుకోవడం వల్లే శరీరంలోకి ఉప్పు అధికంగా చేరుతోందని పేర్కొంది. అయితే, దేశాలవారీగా ఈ ఆహారంలో ఉప్పు మోతాదుల్లో తేడాలు ఉన్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో తాజాగా నిర్దేశించిన పరిమాణంలోనే ఉప్పు వినియోగం ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

ప్యాక్ చేసిన బ్రెడ్, స్నాక్స్, మాంసం ఉత్పత్తులు, చీజ్‌ వంటి పదార్థాల్లో నిర్దేశిత సోడియం కంటెంట్‌ను ఉపయోగించాలని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. అయితే, మన దేశంలో విక్రయించే బంగాళాదుంప చిప్పులో ప్రతి 100 గ్రాముల ప్యాకెట్లో 500 మిల్లీ గ్రాముల సోడియం ఉంటోందన్నారు. 

కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా ఈ ఆదేశాలను జారీ చేసింది. కాబట్టి.. ఇకపై ఆహారంలో ఉప్పు వేసినప్పుడు ఒకసారి ఆలోచించండి. రోజుకు 5 గ్రాములకు మించిన ఉప్పు తినొద్దు.

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.