Sunday 4 July 2021

రెండు డోసుల టీకాతో 98 శాతం రక్షణ నీతి ఆయోగ్ సభ్యుడు వీకేపాల్

రెండు డోసుల టీకాతో 98 శాతం రక్షణ నీతి ఆయోగ్ సభ్యుడు వీకేపాల్

రెండు డోసుల టీకాతో 98 శాతం రక్షణ నీతి ఆయోగ్ సభ్యుడు వీకేపాల్ చండీగఢ్ లోని 'పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, రీసెర్చ్' పంజాబ్ పోలీసుల పై జరిపిన అధ్యయనాన్ని ఆయన ఉటంకించారు


రెండు డోసుల టీకాతో 98 శాతం రక్షణ నీతి ఆయోగ్ సభ్యుడు వీకేపాల్


దేశంలో అందిస్తున్న రెండు వ్యాక్సిన్లు (కొవాగ్జిన్, కొవిషీల్డ్) ప్రజలకు రోగ తీవ్రత, మరణం నుంచి మంచి రక్షణ కల్పిస్తున్నట్లు ఓ అధ్యయనంలో తేలిందని నీతి ఆయోగ్ సభ్యుడు వీకేపాల్ వెల్లడించారు. 




ఈమేరకు చండీగఢ్ లోని 'పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, రీసెర్చ్' పంజాబ్ పోలీసుల పై జరిపిన అధ్యయనాన్ని ఆయన ఉటంకించారు. 

ఈ అధ్యయనం ప్రకారం ఒక్క డోసు తీసుకున్న వారికి 92 శాతం, రెండు డోసులు తీసుకున్న వారికి 98శాతం ప్రాణాపాయం నుంచి రక్షణ లభించినట్లు వెల్లడించారు. 

పంజాబ్ పోలీసుల్లో 'టీకా తీసుకోని వారు, ఒక డోసు తీసుకున్నవారు, రెండు డోసులు వేసుకున్నవారు' అనే 3 గ్రూపులుగా చేసి ఈ అధ్యయనం జరిపారు. "పంజాబ్ పోలీసుల్లో వ్యాక్సిన్ తీసు కోని వారు 4,868 మంది ఉండగా అందులో 15మంది కొవిడ్ బారినపడి మరణించారు. 

ఒక్క డోసు తీసుకున్న 35,856 మందిలో 9 మంది చనిపోయారు. 42, 720 మంది పోలీసులు రెండు డోసులూ తీసుకోగా, వారిలో ఇద్దరు మాత్రమే ప్రాణాలు కోల్పోయారు. 

ఈ అధ్యయనం ప్రకారం వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల రోగ తీవ్రత, మరణభయం దాదాపు పూర్తిగా తగ్గిపో తున్నట్లు తేలింది. ఇదివరకు సీఎంసీ వెల్లూర్లో నిర్వహించిన అధ్యయనంలోనూ ఇదే స్పష్టమైంది. మన వ్యాక్సిన్లు సమర్థ వంతంగా పని చేస్తున్నాయనడానికి ఇదే నిదర్శనం" అని వీకే పాల్ అన్నారు.

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.