Saturday 17 July 2021

వ్యాక్సినేషన్లో ఉపాధ్యాయులకు ప్రాధాన్యత

వ్యాక్సినేషన్లో ఉపాధ్యాయులకు ప్రాధాన్యత రాష్ట్రంలో ఉపాధ్యాయులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పరిగనిస్తూ కరోనా వ్యాక్సిన్ ప్రక్రియలో ప్రాధాన్యత ఇస్తున్నామన

వ్యాక్సినేషన్లో ఉపాధ్యాయులకు ప్రాధాన్యత రాష్ట్రంలో ఉపాధ్యాయులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పరిగనిస్తూ కరోనా వ్యాక్సిన్ ప్రక్రియలో ప్రాధాన్యత ఇస్తున్నామని విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ 


వ్యాక్సినేషన్లో ఉపాధ్యాయులకు ప్రాధాన్యత


వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఉపాధ్యాయులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు. వ్యాక్సినేషను వేగవంతం చేసేలా వైద్యారోగ్య శాఖాధికారులతో విద్యాశాఖ అధికారులు సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు.




వ్యాక్సినేషన్లో ఉపాధ్యాయులకు ప్రాధాన్యత రాష్ట్రంలో ఉపాధ్యాయులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పరిగనిస్తూ కరోనా వ్యాక్సిన్ ప్రక్రియలో ప్రాధాన్యత ఇస్తున్నామని విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ 


టీచర్లకు వ్యాక్సినేషన్


రాష్ట్రంలో ఉపాధ్యాయులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పరిగనిస్తూ కరోనా వ్యాక్సిన్ ప్రక్రియలో ప్రాధాన్యత ఇస్తున్నామని విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యా రంగం లో ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ప్రొఫె సర్లు, ఇతర సిబ్బంది కి కూడా ఈ నెలలో వాక్సిన్ వేయడానికి ఇప్పటికే ప్రజా రోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన తెలిపారు. 

దీనిపై అధికారులతో వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా మాట్లాడి తగు సూచనలు చేశామన్నారు. కళాశాలలు ప్రాంతీయ విద్యాధికారులు, పాఠశాల ప్రాంతీయ విద్యా సంచాలకులు, జిల్లా విద్యా శాఖ అధికారులు, విశ్వ విద్యాలయ రిజిస్ట్రార్లు, ట్రిపుల్ ఐటీ డైరెక్టర్లు సంబంధిత జిల్లాల జాయింట్ కలెక్టర్లు (అభివృద్ధి), జిల్లా వైద్యాశాఖధికారులతో సంప్రదించి సమన్వయం చేసుకోవాలని ఆదేశించినట్లు మంత్రి సురేష్ తెలిపారు. 

అన్ని జిల్లాల్లో ఉపాధ్యాయులకు జరుగుతున్న వ్యాక్సిన్ ప్రక్రియపై ఎప్పటికప్పుడు మంత్రి పేషీకి సమాచారం ఇవ్వాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు.

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.